వడ్డేపల్లి, నవంబర్ 17: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులను గ్రామస్థులు అడ్డుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లెడదిన్నెకు అలంపూర్ కాంగ్రెస్ అభ్య ర్థి సంపత్కుమార్ కుమారుడు దీపక్ ప్రచారానికి వెళ్లగా వాహనాన్ని అడ్డుకున్నారు. సంపత్కుమార్ ఎమ్మెల్యేగా ఉండి గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.
దళితవాడకు దారి లేకపోవడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నదని.. సమస్యను పరిష్కరించాలని అప్పట్లో సంపత్కుమార్కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని విమర్శించారు. అందుకోసమే కాంగ్రెస్ నేతల ప్రచారం తమకు అవసరం లేదంటూ వారిని అక్కడినుంచి పంపించి వేశారు.