వరంగల్ : బొగ్గు రవాణా లారీలు(Coal Transport) నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామస్తులు గురువారం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై (Warangal-Khammam National Highway) ధర్నా చపట్టారు. బొగ్గు రవాణా కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.
స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్తులను సముదాయించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.