సిద్దిపేట : దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు చుక్కెదురైంది. తొగుట మండలం గుడికందుల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. గుడికందులలో రైతు బజార్ ప్రారంభించడానికి రాగానే మహిళలు, గ్రామస్తులు నిరసన తెలుపుతూ అడ్డుకున్నారు. గ్రామానికి ఇస్తానన్న 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. ప్లే కార్డులు ప్రదర్శించి బీజేపీకి, రఘునందన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇచ్చిన హామీని నిలుబెట్టుకున్నాకే గ్రామంలో అడుగుపెట్టాలన్నారు.