కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు
హైదరాబాద్, మార్చి 16 : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)గా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్రాజ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి ప్రమోద్కుమార్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. వెంటనే సీఈవోగా బాధ్యతలు చేపట్టాలని ఎన్నికల సం ఘం ఆదేశించింది. సీఈవోగా ఉన్న శశాంక్గోయల్ కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్పై వెళ్లడంతో ప్రస్తుతం ఈ పోస్టు ఖాళీగా ఉన్నది. ఇంచార్జి సీఈవోగా అడిషనల్ సీఈవో బుద్ధప్రకాశ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేథప్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి సీఈవోగా వికాస్రాజ్ను నియమించింది. ప్రస్తు తం వికాస్రాజ్ జీఏడీ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.