హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్కుమార్ తడకమల్లకు యూకే సాహిత్య ఫెస్టివల్ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 6 నుంచి 10 వరకు యూకేలో జరిగే 74 ఏండ్ల చరిత్ర కలిగిన చెల్టెన్హామ్ లిటరేచర్ ఫెస్టివల్కు హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానం పంపారు. ప్రపంచంలోనే తొలి లిటరేచర్ ఫెస్టివల్గా పేరుగాంచిన ఈ కార్యక్రమానికి ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు సాహితీవేత్తలను ఆహ్వానించడం సంప్రదాయం. ఉస్మానియా యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పనిచేసిన ప్రొఫెసర్ విజయ్కుమార్కు ఆహ్వానం అందడంపై పలువురు అభినందనలు తెలిపారు. అర్జెంటీనా, బోట్సువానా, నైజీరియా, టర్కీ నుంచి కూడా సాహితీవేత్తలు కార్యక్రమంలో పాల్గొననున్నారు.