హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : బుద్ధుడు, ఆచార్య నాగార్జునుడి గురించి తమ తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నామని, నేడు వారికి సంబంధించిన మ్యూజియంను ప్రత్యక్షంగా సందర్శించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని వియత్నాం మీడియా ప్రతినిధుల బృందం పేర్కొన్నది. హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్పై శిక్షణ కోసం వచ్చిన సభ్యులు తమ పర్యటనలో భాగంగా నాగార్జునకొండ, బుద్ధవనం ప్రాజెక్టు, ఏఎస్ఐ మ్యూజియంను సందర్శించింది. ఈ సందర్భంగా బుద్ధుడి స్థూపాలు, అప్పటి వస్తువులు, ఆచార్య నాగార్జునుడికి సంబంధించిన వీడియోలను తిలకించారు. బుద్ధుడి విగ్రహానికి ప్రార్థనలు చేశారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 26మంది మీడియా ప్రతినిధులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.