సుల్తాన్బజార్, మార్చి 5 : నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో పసికందు హత్యకు కారణమైన నిందితులపై చర్యలు తీసుకొని తమకు ప్రాణరక్షణ కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ బాధితులతో కలిసి గురువారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్అక్తర్ స్పందిస్తూ.. ఈ నెల 24న సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్, రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల రాఘవేందర్ ముదిరాజ్, బాధితులు మాట్లాడుతూ.. కుమ్మెర ఘటనలో నిందిలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఐపీసీ 302, 307 బీఎన్ఎస్ఎస్ల కింద కేసు పెట్టకుండా కేవలం అట్రాసిటీ కేసు పెట్టి దాడి చేసిన వారిని రక్షిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించినట్టు తెలిపారు.