రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లాలో మూడు రోజుల క్రితం కరీంనగర్లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి (Pandem kodi) వేలం(auction) పాటను ఆపాలని ఆర్టీసీ డిపో అధికారులకు(RTC officials) కోడి యజమాని విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలికి చెందిన వల్లపు మహేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికునిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
తన బంధువులు ఇచ్చిన పందెం కోడిని తీసుకొని రుద్రంగి నుంచి మహేష్ నెల్లూరుకి వెళ్తూ ఉండగా దాదాపు 12 గంటల సమయంలో వరంగల్ చేరుకోగానే నిద్రమత్తులో బస్సు నుంచి దిడాడు. కోడి లేదని తెలుసుకొని వెతికే క్రమంలో బస్సు అప్పటికే వెళ్లిపోయిందని బాధితుడు తెలిపారు. ఆర్టీసీ అధికారులు పందెం కోడిని వేలం పాట వేస్తున్నారని తెలవడంతో ఆ కోడి నాదేనంటూ దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, వేలంపాటను ఆపాలని కోరినిట్లు మహేష్ తెలిపాడు.
కాగా, ఈ నెల 9న వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళ్తున్న బస్సు కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో పందెం కోడిని తన వెంట తీసుకు వెళ్తున్న ప్రయాణికుడు దానిని బస్సులోనే మరిచి వెళ్లిపోయాడు. బస్సులో బ్యాగ్ గమనించిన సహచర ప్రయాణికులు విషయాన్ని కంట్రోలర్ దృష్టికి తెచ్చారు. అందులో ఏముందో పరిశీలించేందుకు ఆర్టీసీ సిబ్బంది దానిని తెరిచి చూడగా, భద్రంగా ప్యాక్ చేసి ఉన్న పందెంకోడి కనపడింది.
దీంతో దాన్ని సంరక్షించేందుకు ఆర్టీసీ సిబ్బంది కరీనంగర్(2) డిపోకు తరలించారు. మూడు రోజులుగా సిబ్బంది అటు ఆర్టీసీ బస్సులతో పాటు పందెపుకోడి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. దానిని తీసుకు వెళ్లేందుకు యజమాని వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో శుక్రవారం వేలానికి ముహూర్తం నిర్ణయించారు.