పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారని రాజ్యసభలో ప్రశంస
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం.. ఎంపీ సంతోష్ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారని రాజ్యసభలో సభ్యులకు వివరించారు.
తెలంగాణకు చెందిన యువ ఎంపీ దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా మొక్కలు నాటుతూ, అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ గొప్ప పాత్ర నిర్వహిస్తున్నారని కొనియాడారు. రాజ్యసభ తరఫున ఆయనను అభినందిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా సభ్యులంతా కరతాళధ్వనుల మధ్య ఎంపీ సంతోష్ను అభినందించారు.