సానుకూల దృక్పథం సాధనకు మార్గమని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. మంగళవారం బేగంపేట్లోని హోటల్ ఐటీసీ కాకతీయలో జరిగిన ఫిక్కీ ఫ్లో సభ్యుల వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రతినిధులతో తన మనోభావాలను పంచుకున్నారు. ‘ద పవర్ ఆఫ్ పాజిటివిటీ’ అనే అంశంపై ప్రసంగించారు. ఫ్లో, యెలో చైర్పర్సన్లు ఉషారాణి మన్నె, అపూర్వ జైన్లతో తన మొదటి సినిమా మొదలు తన చదువు, మార్కులు, నటన తదితర అంశాలపై తన అనుభవాలను వివరించారు. ‘హమ్ ఆప్కే హై కౌన్’ సినిమా సమయంలో కలిగిన స్వల్ప పక్షపాతం తనను తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందని చెప్పారు. వైద్యుల సలహాకు విరుద్ధంగా 20 రోజుల తన చివరి షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేయగలిగాన తెలిపారు. భారతీయ నటులు విదేశీ నటులకు ధీటుగా రాణించగలరన్నారు. దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సెషన్ ఆద్యంతం ఆహ్లాదంగా కొనసాగింది.