హుజురాబాద్ నూతన ఏసీపీగా హైదరాబాద్ సీఐడీ విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీ వెంకట్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం హుజూరాబాద్ ఏసీపీగా ఉన్న శ్రీనివాస్ ను బదిలీపై డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లాకు చెందిన వెంకట్రెడ్డి మహిళా భద్రతా విభాగానికి అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఉత్తమ పోలీస్ ఉద్యోగిగా ప్రశంసలతో పాటు లక్ష రూపాయల రివార్డ్ కూడా అందుకున్నారు మహిళా భద్రతా విభాగంలో ఉన్న డిఎస్పీ వెంకట్ రెడ్డి షీ టీమ్స్, భరోసా టీమ్స్ లాంటి కార్యక్రమాల్లో ప్రజలను చైతన్య పరచటంలో ఎంతో కృషి చేశారు.
మహిళలను టెక్నాలజీ సహాయంతో వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఎన్నో వందల కేసులను సునాయాసంగా పరిష్కరించారు. మహిళలను వేధించిన వారిని, ఏదైనా ఇబ్బంది పెట్టిన వారిని ఆన్ లైన్ కౌన్సెలింగ్ ద్వారా వారికి సరైన మార్గం చూపెట్టి వారిని మార్చే ప్రయత్నం చేయటం ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని ఆయనకు పేరుంది.