శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 9 : సూపర్పవర్గా భారత్ ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరుకున్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టులో శ్రీకోధినామ ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అమెరికా, ఐరోపా సమాఖ్య, చైనాతో పోటీపడుతూ భారత్ అంతర్జాతీయస్థాయిలో ముందుకు వస్తుందని చెప్పారు. కొత్త సంవత్సరమైన ఉగాది రోజున నూతన సంకల్పంతో సంసిద్ధులు కావాలని అన్నారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పలువురు ట్రస్టు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.