హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్ తెలంగాణ భవన్లో ‘కృతజ్ఞత సభ’ నిర్వహించనున్నట్టు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య వెల్లడించారు. నాచారంలోని సంఘం కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆటోలకు ఫిట్నెస్ చార్జీలను రద్దు చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ పాల్గొంటారని వివరించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.