హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టాలఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడీఈఏ) కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. గౌరవ అధ్యక్షుడిగా కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు కే మురళీ మనోహర్, అధ్యక్షుడిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక యూనివర్సిటీ వీసీ కే సీతారామారావు, సెక్రటరీ జనరల్గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అభ్యాసక సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి, వివిధ కు చెందిన నలుగురిని ఉపాధ్యక్షులుగా, మరో ముగ్గురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకొన్నారు. ఈ కార్యవర్గం కాలపరిమితి రెండేండ్లు ఉంటుంది. అంతకుముందు ఓయూలో రెండురోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సులో పలువురు వక్తలు మాట్లాడు తూ.. దూరవిద్యను బలోపేతం చేయడంతో పాటు మారుతున్న పరిస్థితుల కు అనుగుణంగా ఆధునీకరించేందుకు ప్రభుత్వాలు అన్ని విధాల సహకరించాలని అభిప్రాయపడ్డారు. సదస్సులో వీసీలు నాగేశ్వరరావు, డీ రవీందర్, కే సీతారామారావు, రమేశ్, రాజన్ వెలుకర్, న్యాక్ మాజీ డైరెక్టర్ వీఎస్ ప్రసాద్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాం త ఆచార్యులు హరగోపాల్ పాల్గొన్నారు.