భీమదేవరపల్లి, ఆగస్టు 27: పీవీ నడియాడిన నేల వంగరను ఏడాదిలోగా టూరిజం స్పాట్గా తీర్చిదిద్దుతామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో పీవీ స్మృతివనం నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పీవీ నరసింహారావు శతజయంత్యుత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. వంగరలో పీవీ జ్ఞానవేదిక, ఎగ్జిబిషన్, ఓపెన్ థియేటర్, స్వాగత తోరణం, డబుల్రోడ్డు, మ్యూజియంగా పీవీ ఇల్లు తదితర వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. వేసవిలో విద్యార్థులు సందర్శనకు వచ్చేలా చూస్తామని తెలిపారు. బస్సుల్లో పిల్లలు వెళ్తుంటే పీవీ జీవిత విశేషాలు అన్ని వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్ తదితరులుహాజరయ్యారు.