హైదరాబాద్, డిసెంబర్ 15: హైదరాబాద్లోనే మొట్టమొదటి అతిపెద్ద ఔట్లెట్ మాల్.. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ శుక్రవారం పటాన్చెరులో ప్రారంభమైంది. వాల్యూ జోన్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ సినీహీరో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఇది ఆవిష్కృతమైంది. నాణ్యమైన వస్తూత్పత్తులు ఆకర్షణీయమైన ధరలకే లభిస్తాయని, అన్ని వర్గాలకు నచ్చిన, కోరిన బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు, జాతీయ రహదారికి సమీపంలో ఈ మాల్ను తీసుకొచ్చామన్న సంస్థ.. అమీర్పేటకు, ఐటీ కారీడార్కు కేవలం 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఏర్పాటు చేశామని వివరించింది. ‘రిటైల్ వ్యవస్థ చరిత్రలో వాల్యూ జోన్ ఓ సరికొత్త అధ్యాయం. వినూత్నమైన షాపింగ్ అనుభవాన్ని కొనుగోలుదారులు సొంతం చేసుకుంటారు. కస్టమర్ల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఈ మాల్ను తెచ్చాం. వినియోగదారుల అన్ని అవసరాలు ఇక్కడ తీరుతాయి. సువిశాలమైన స్థలంలో ఏర్పాటు చేశాం’ అని సంస్థ డైరెక్టర్లు సురేశ్ సీర్ణ, పీవీఎస్ అభినవ్, టీ రాకేశ్, టీ కేశవ్ గుప్తాలు అన్నారు.