హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేల్కొలిపేలా సమున్నతంగా, అంగరంగ వైభవంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఈ నెల 9 నుంచి 21 వరకు నిర్వహించే ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం’కార్యక్రమాల షెడ్యూల్ను ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కేశవరావు గురువారం విడుదల చేశారు.