హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సతీశ్ మహాన్ ఆదివారం తెలంగాణ రాష్ట్ర శాసనసభను సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సతీష్ మహాన్ కు తెలంగాణ రాష్ట్ర శాసనసభ నిర్వాహణ, పనితీరును గురించి స్పీకర్ పోచారం వివరించారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ నిర్వహణ అత్యుత్తమంగా ఉన్నదని, ప్రజా సమస్యలపై చర్చలు అర్ధవంతంగా జరుగుతున్నాయని స్పీకర్ పోచారం తెలిపారు. శాసనసభ సమావేశాల నిర్వాహణ, పద్ధతులపై రెండు స్పీకర్లు చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ స్పీకర్ సతీష్ మహాన్ను స్పీకర్ పోచారం శాలువాతో సత్కరించి, మొమెంటో బహుకరించారు. ఈ కార్యక్రమంలో లెజిస్లేటివ్ సెక్రెటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు కూడా పాల్గొన్నారు.