హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య సోషల్ మీడియాలో కొనసాగుతున్న అంతర్గత పోరుకు సంబంధించి సైబర్క్రైం పోలీసులు యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్రూమ్ ఇంచార్జి ప్రశాంత్కు నోటీసులు జారీచేశారు. గుర్తుతెలియని వ్యక్తులు తనను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారం టూ టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన సైబర్క్రైం పోలీసులు..
నిందితుల లొకేషన్ ఆ ధారంగా సోమవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని యూత్ కాంగ్రెస్ సోష ల్ మీడియా వార్రూమ్లో సోదాలు నిర్వహిం చి రాజేశ్, రాజు, అజయ్ అనే యువకులను అదుపులోకి తీసుకోవడంతోపాటు మూడు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ప్రశాంత్ ఆదేశాల మేరకే ఉత్తమ్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టామని ఈ ముగ్గురు యువకులు వెల్లడించారు. సోషల్ మీడియా లో పోస్టులపై విచారణకు హాజరై వివరణ ఇ వ్వాలని ప్రశాంత్ను ఆదేశిస్తూ సైబర్క్రైం పోలీసులు బుధవారం నోటీసులు జారీచేశారు.