హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం మేధావులు, బీసీ సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి భారత జాగృతి చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా అన్ని బీసీ సంఘాల నాయకులు ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం హైదరాబాద్లో కలిసి అభినందించారు.
తెలంగాణ బీసీ హకుల కోసం ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సుదీర్ఘ చర్చల అనంతరం బీసీ డిమాండ్ల పరిషారం కోసం ‘యునైటెడ్ పూలే ఫ్రంట్’ (యూపీఎఫ్) పేరిట ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి రెండో వారంలో హైదరాబాద్లోని ఇందిరాపారు వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తామని ప్రకటించారు.
అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం ఫిబ్రవరి 5 నుంచి 10 మధ్య అన్ని జిల్లాలతోపాటు విశ్వవిద్యాలయాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 11న పూలే జయంతిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి డిమాండ్ చేసిన మరునాడే సీఎం రేవంత్రెడ్డి బీసీ సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి బీసీల జనగణన, రిజర్వేషన్లపై చర్చించారని గుర్తు చేశారు.
ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోదించిన 9 తీర్మానాలకు విశేష స్పందన వస్తున్నదని, మంత్రులు తమపై విమర్శలు చేస్తున్నారంటే బీసీ ఎజెండాపై కదలిక వస్తున్నట్టు అర్థమని పేర్కొన్నారు. తమ డిమాండ్లకు బీఆర్ఎస్తోపాటు సీపీఐ, సీపీఎం వంటి వామపక్ష పార్టీల నుంచి మద్దతు లభించిందని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంబేదర్ విగ్రహాన్ని సాధించిన భారత జాగృతి సంస్థ పూలే విగ్రహం కోసం కూడా పోరాటం చేసి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కవితను కలిసిన వారిలో బీసీ నాయకులు వీ ప్రకాశ్, గట్టు రామచందర్రావు, పల్లె రవికుమార్గౌడ్, జూలూరి గౌరీశంకర్, ఆంజనేయులుగౌడ్, గెల్లు శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజ్గౌడ్, విప్లవ్కుమార్, రాజారాం యాదవ్, సర్దార్ రవీందర్సింగ్, దావ సురేశ్, మఠం భిక్షపతి, భారత జాగృతి నాయకులు రాజీవ్సాగర్, నవీన్ ఆచారి, పద్మశాలి సంఘం నాయకుడు బొల్ల శివశంకర్ తదితరులు ఉన్నారు.
13వ బుద్ధిస్ట్ కౌన్సిల్ సమావేశానికి ఆహ్వానం
ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నాందేడ్ జిల్లా కినావట్లో నిర్వహించనున్న 13వ బుద్ధిస్ట్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై సమావేశాలను ప్రారంభించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బౌద్ధ ధర్మ పరిషత్ ఈ సందర్భంగా ఆహ్వానించింది.