అమ్రాబాద్, జూన్ 7 : గ్లోబల్స్టార్ హీరో రాంచరణ్ సతీమణి కొణిదెల ఉపాసన ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా విభాగానికి నేషనల్ అంబాసిడర్గా నియమితులైనట్టు నాగర్కర్నూల్ డీఎఫ్వో రోహిత్ గోపిడి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అపోలో దవాఖాన ట్రస్ట్లో సామాజిక సేవాకార్యక్రమాల విభాగంలో వైస్ చైర్పర్సన్గా ఉన్న ఉపాసనకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా విభాగం.. అపోలో హాస్పిటల్ ట్రస్ట్ మధ్య ఒప్పందం ప్రకారం నాలుగేండ్లపాటు పదవీ బాధ్యతలు అప్పజెప్పినట్టు పేర్కొన్నారు. తాజా ఒప్పందం నేపథ్యంలో సంరక్షణ కేంద్రాలు, వన్యప్రాణి రక్షిత ప్రాంతాల్లో గాయపడిన పులులు వైద్యం అందించడంతోపాటు, అటవీశాఖ సిబ్బందికి అపోలో దవాఖానలో నాణ్యమైన చికిత్స అందిస్తారని తెలిపారు.