హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్) ప్రొఫెసర్ ఆనంద్ కే కొండపాల్ పర్యవేక్షణలో రూపొం దించిన యాంటీ హెచ్ఐవీ డ్రగ్కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ హక్కులు మంజూరు చేసింది. ‘నావెల్ యాంటీ హెచ్ఐవీ-1 హెటెరోఆరో మ్యాటిక్ కాంపౌండ్స్ టార్గెటెడ్ టు టొపొఐసోమెరాసే-2 బెటా కైనాసె’ పేరుతో యూవోహెచ్ బయోటెక్నా లజీ, అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ విభాగాలు రూపొందించిన ఈ డ్రగ్కు 2017 మే నుంచి 20 ఏండ్లపాటు పేటెంట్ హక్కులు వర్తిస్తాయి.