హైదరాబాద్ : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెడ్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జేవీ మధుసూదన్ ఎన్సీఈఆర్టీకి చెందిన 14వ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ కమిటీ(ఈఆర్ఐసీ) సభ్యునిగా నామినేట్ అయ్యారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మధుసూదన్ను నామినేట్ చేసింది.
పాఠశాల విద్య అదేవిధంగా ఉపాధ్యాయ విద్యారంగంలో ప్రాథమిక పరిశోధనలతో పాటు పరిశోధన, ఆవిష్కరణల ప్రణాళిక, గుర్తింపు, మద్దతుపై సలహా ఇవ్వడానికి ఆయన నామినేట్ అయ్యారు. డాక్టర్ మధుసూదన్ 2018 లో హైదరాబాద్ వర్సిటీ లోని ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ విభాగంలో చేరారు. డెమోగ్రఫీ ఆఫ్ స్కూలింగ్, హెల్త్ ఎడ్యుకేషన్, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగాలలో ఆయన నిపుణుడు.