టీఎస్టీఎస్ సంస్థతో అధికారుల మంతనాలు
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రతి విద్యార్థికి యూనిక్ ఐడీ అమలు చేసేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్టూడెంట్ ఆథరైజేషన్ సాఫ్ట్వేర్ను వినియోగించనున్నది. ఈ సాఫ్ట్వేర్ సేకరణకు వర్సిటీ అధికారులు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్టీఎస్)తో మంతనాలు జరుపుతున్నారు.
ఈ విధానం ద్వారా వర్సిటీలో ఆన్లైన్ సేవలను విస్తృతం చేయడంతోపాటు చెల్లింపులను ఆన్లైన్లోనే చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలో మొదటి విడత సీట్ల భర్తీ పూర్తయ్యింది. త్వరలో రెండో విడత సీట్లను కేటాయించనున్నారు. కొన్ని కోర్సుల్లో సీట్లు పూర్తిగా నిండలేదు. దరఖాస్తు చేసుకోని విద్యార్థులతో భర్తీచేయాలని అధికారులు నిర్ణయించారు. మొదట వచ్చిన వారికి మొదటగా సీట్లను కేటాయిస్తారు.