నాంపల్లి , ఆగస్టు 30 : తొందరపాటుతో బీజేపీలో చేరిన కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆ పార్టీలో ఇమడలేక తిరిగి టీఆర్ఎస్లోకి వస్తున్నారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన కన్నెబోయిన శంకర్, కన్నెబోయిన బాలగిరి, పోనాల శ్రావణ్, ఎడ్ల శివ, పలువురు కార్యకర్తలు ఇటీవల బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఇమడలేక మంగళవారం చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో తిరిగి టీఆర్ఎస్లో చేరి గులాబీ కండువా కప్పుకొన్నారు.
మునుగోడు నియోజక వర్గంలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని డీ నాగారం గ్రామానికి చెందిన 50 కుటుంబాల వారు, నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని నెర్మట గ్రామానికి చెందిన వివిధ పార్టీల వారు 20 మంది మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లో టీఆర్ఎస్లో చేరి గులాబీ కండువా కప్పుకొన్నారు.