హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ వర్సిటీల్లో ఆర్అండ్డీ, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్కుమార్ వైస్చాన్స్లర్లకు సూచించారు. ఈ దిశగా ఇప్పటికే పలు సెంట్రల్ వర్సిటీలు పురోగతి సాధించాయని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మరిన్ని ఆర్అండ్డీ, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 45 సెంట్రల్ వర్సిటీల వీసీలతో మంగళవారం ఆయన వర్చువల్గా సమావేశమయ్యారు. నూతన విద్యావిధానం, ఇతర సంస్కరణలపై వీసీలతో చర్చించి పలు సూచనలు చేశారు. కొత్తగా అనువాదం, మ్యూజియం అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కన్జర్వేషన్, గ్రాఫిక్ డిజైన్, వెబ్డిజైన్ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని జగదీశ్కుమార్ సూచించారు హెచ్సీయూ వీసీ ప్రొఫెసర్ బీజేరావు, ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేశ్కుమార్, ఉర్దూ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సయ్యద్ అయినుల్ హసన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.