KCR | ఎంపీ ఎన్నికలు పాలకపక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే దిగ్విజయం పొందే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
క్రోది నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని పండితులు తెలిపారు. కుజుడు అధిపతిగా ఉండటం వల్ల వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొ్న్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, నదులన్నీ బాగా ప్రవహస్తాయని, దీని ద్వారా పాడి పంటలు మంచిగా పడుతాయన్నారు. ధరలు అధికమవుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులకు రాబోయే ఎన్నికల్లో పాలకపక్షంగా ఉన్నవారికి కొంత కష్టసాధ్యంగా ఉంటుందని తెలిపారు. ప్రతిపక్షంగా ఉన్నవారు ప్రయత్నిస్తే దిగ్విజయ ఫలితాలు ఉండే అవకాశం కనిపిస్తుందని చెప్పారు.
కేసీఆర్ రాశి కర్కాటక రాశి అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 గా ఉందని.. రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందని తెలిపారు. గురుడు మంచి స్థానంలో ఉన్నాడని.. ఈ సంవ్సతరమంతా వీరికి బాగుంటుందని తెలిపారు. వీరు చేసే వ్యవహరాల్లో మంచి విజయం చేకూరే అవకాశాలున్నాయని తెలిపారు. కర్కాటక రాశి వాల్లు వేసే ఎత్తుగడలు ఫలిస్తాయని.. వారి నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుందని అన్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి ప్రతిష్ఠ ఉంటుందన్నారు. వారి మాటకు, గమనానికి ఈ ఏడాది అడ్డు ఉండదని అన్నారు. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని సూచించారు. ప్రయాణాలు ఎక్కువగా చేయవద్దని.. వాహన ప్రమాద సూచన ఉందని. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దోష నివారణకు లక్ష్మీ, మోహన గణపతిని ఆరాధించాలన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ది మకర రాశి అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉందని, రాజ్యపూజ్యం 3, అవమానం 1 గా ఉందని పండితులు తెలిపారు. ఈ రాశి వారు ఏ పనిచేసినా బ్యాలెన్స్గా చేయాలని సూచించారు. మాటను కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటలను మృదువుగా మాట్లాడం వల్ల , చక్కటి ఉపకారాన్ని, అభిమానాన్ని పొందగలుగుతారని అన్నారు. వ్యాపారం రంగంలో కూడా అభివృద్ధి చెందే వారు ఈ రాశివారని అన్నారు. దొంగల వల్ల కొంత నష్టం కలిగే అవకాశం ఉందని, ప్రజలు, పార్టీలో అందరి అభిమానాన్ని పొందగలుగుతారని అన్నారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉందన్నారు. మకర రాశి వారు జ్యోతిర్లంగ దర్శనం చేసుకోవాలని సూచించారు. రుద్రయాగాలు చేయాలన్నారు.