కామారెడ్డి: జిల్లాలోని రాజంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేట శివారులోని బోరెగడ్డ వద్ద ఓ బైకు (Bike accident) అదుపుతప్పి కింద పడింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను మహేందర్, నిజాముద్దీన్గా గుర్తించారు. వారు బస్వన్నపల్లికి చెందినవారని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.