పెగడపల్లి, మార్చి 19: జాతీయ పక్షి నెమలిని ఇద్దరు దుండగులు వేటాడి తుపాకీలో కాల్చి చంపిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద చోటుచేసుకున్నది. జగిత్యాల డీఎస్పీ డీ రఘుచందర్ మంగళవారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి నలువాల సత్యనారాయణ, జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన జువ్వాజి రాజు సోమవారం రాత్రి దోమలకుంట సమీపంలో నెమలిని వేటాడి తుపాకీతో కాల్చి చంపారు.
తర్వాత కారులో తరలిస్తుండగా, విషయం తెలియడంతో ఎస్సై రామకృష్ణ వెంటనే సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టగా, సత్యనారాయణ, జువ్వా జి రాజు ప్రయాణిస్తున్న కారు అనుమానాస్పదంగా కనిపించింది. అందులో లైసెన్స్ లేని తుపాకీ, గొడ్డలితోపాటు 34 బుల్లెట్లు, నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా, సత్యనారాయణ 2017లో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ జింకలను హత మార్చిన కేసులో ప్రధాన నిందితుడని, ఆ కేసు ఇం కా నడుస్తున్నదని డీఎస్పీ తెలిపారు. సత్యనారాయణ కుమారుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఎస్పీ పనిచేస్తున్నారు.