హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్గా ఉన్న ఏఆర్ శ్రీనివాస్ తెలంగాణ పోలీస్ అకాడమీ అడిషనల్ డైరెక్టర్గా, హోంగార్డ్స్ డీఐజీగా ఉన్న అంబర్ కిశోర్ ఝా రాచకొండ జాయింట్ కమిషన్ (అడ్మిన్)గా బదిలీ అయ్యారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని చెప్పారు.