మహబూబాబాద్ : మహబూబాబాద్(Mahabubabad )జిల్లాలో ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను(Interstate robbers) పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు(Arrested). నిందితుల వద్ద నుంచి 12 తులాల బంగారం, 53 తులాల వెండి వస్తువులు, పల్సర్ బైకును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం మహబూబాబాద్ పట్టణంలోని వివేకానంద సెంటర్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని ఆపి బండి కాగితాలు అడుగగా వారి వద్ద ఎలాంటి ధృవపత్రాలు లేకపోవడంతో అనుమానంతో వారిని విచారించగా పలు దొంగతనాలకు పాల్పడినట్లు పొన్నాల శివశంకర్(42)ఎడ్ల సుమన్ (34) ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందుతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.