హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): వారాంతంలో వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శనివారం రాత్రి సర్వదర్శనం భక్తు ల క్యూలైన్ కంపార్ట్మెంట్లు దాటి అక్టోపస్ భవనం సమీపంలోని ఔటర్ రింగ్రోడ్డు వర కు చేరుకున్నది. దీంతో దర్శనానికి రెండు రోజుల సమయం పడుతున్నది.
శనివారం రాత్రి 8 గంటల వరకు 56,546 మంది భక్తు లు శ్రీవారిని దర్శించుకొన్నారు. రద్దీ దృశ్యా ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రద్దీ నేపథ్యంలో తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.