నాగిరెడ్డిపెట్, సెప్టెంబర్ 5: చర్చి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం పోచారంలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఆదివా రం ఉదయం స్థానిక చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. ఫాదర్ దీపక్డొలాన్సన్ కొడుకు హనిల్సన్ (4), లింగంపేట్ మండంలోని శెట్పల్లి సంగారెడ్డికి చెందిన సాయిలు కూతురు జయశ్రీ అలియాస్ గ్రేసి ( 4) బయట ఆడుకుంటున్నారు. ప్రార్థనలు ముగించుకున్న తల్లిదండ్రులు.. పిల్లల కోసం వెతకగా కనిపించలేదు. చిన్నారుల చెప్పులు పిల్లర్ కోసం తవ్విన గుంత వద్ద కనిపించడంతో అందులో చూడగా చిన్నారులు కనిపించారు. వెంటనే వారిని బయటికి తీయ గా మృతిచెంది ఉన్నారు. తాసిల్దార్ సయ్యద్అహ్మద్, ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.