హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి టీవీఎస్ మోటర్స్ సంస్థ నూతన మాడల్ రోనిక్ ద్విచక్ర వాహనాన్ని విరాళమిచ్చింది. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎండీ సుదర్శన్ వేణు తరపున సంస్థ ప్రతినిధి వరదరాజన్ వాహన పత్రాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సిద్ధార్థ్, తిరుపతి శ్రీనివాస, టీవీఎస్ డీలర్ రాజారెడ్డి, తిరుమల డీఐ జానకీరాంరెడ్డి పాల్గొన్నారు. 225 సీసీ సామర్థ్యం గల ఈ వాహనం ధర రూ.1,81,845 అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.