ధర రూ.1.14 లక్షలు
హైదరాబాద్, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో విద్యుత్తో నడిచే వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్…సరికొత్త ఈ-స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్లో ఎంపిక చేసిన డీలర్ల వద్ద మాత్రమే లభించనున్న‘ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.1,14,014గా నిర్ణయించింది. కేవలం 4.2 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ స్కూటర్ గంటకు 78 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఓవర్ స్పీడ్ అలర్ట్, రిమోట్తో బ్యాటరీ చార్జింగ్ ఎంతైందో తెలుసుకునే ఫీచర్చ్ ఈ స్కూటర్లో ఉన్నాయి. బ్యాటరీ పూర్తిస్థాయి రీచార్జితో 75 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. రూ.5 వేలు ముందస్తుగా చెల్లించి ఈ మోడల్ను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా సంస్థ కల్పించింది.