కేసముద్రం/కాశీబుగ్గ, ఆగస్టు 9 : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పసుపు ధర రూ.13,221 పలికింది. ఈ ఏడాదికి ఇదే గరిష్ఠ ధర కావడం విశేషం. మార్కెట్కు 56 క్వింటాళ్ల పసుపు విక్రయానికి రాగా గరిష్ఠంగా క్వింటాల్కు రూ.13,221, కనిష్ఠంగా 8,651 పలికింది.
కాగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పసుపు క్వింటా ధర గరిష్ఠంగా రూ.13 వేలు పలికింది.