హైదరాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ కమిటీలను రద్దు చేసింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న 123 మార్కెట్ కమిటీలు రద్దయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 197 మారెట్ కమిటీలకు త్వరలో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
కొత్తగా ఏర్పాటు కాబోయే కమిటీలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేస్తుందని చెప్పారు. కొత్త మారెట్ కమిటీ కార్యవర్గంలో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారని (చైర్మన్, వైస్ చైర్మన్తో కలిపి), 12 మంది నామినేటెడ్ సభ్యులు, ఇద్దరు అధీకృత వ్యాపారస్తులు (లైసెన్డ్స్ ట్రేడర్స్) మిగిలిన నలుగురు ఎక్స్అఫీషియా సభ్యులు ఉంటారని తెలిపారు. పాలకవర్గ పదవీకాలం రెండేండ్లు ఉంటుంది. దీనికి అదనంగా రెండుమార్లు ఆరు నెలల చొప్పున గడువు పొడగించే అవకాశం కల్పించారు.