Tirumala | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : మే, జూన్ నెలలకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది.
ఉదయం 10 గంటల నుంచి http//tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్చేసుకోవాలని అధికారులు భక్తులకు సూచించారు. టీటీడీ మొబైల్ యాప్ ttdevasthanams ను కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.