హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం సమకూరింది. శుక్రవారం ఒక్కరోజే హుండీ కానుకల ద్వారా రూ.4.31 కోట్లు వచ్చాయి. స్వామివారిని 62,593 మంది భక్తులు దర్శించుకోగా, 18,517 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 8 గంటల సమయం వేచి చూడాల్సి వస్తున్నది. తమిళ హీరో జయం రవి శనివారం కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.