హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : సమైక్య ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణానికి 18 ఏండ్ల సర్వీసును వదులుకొన్న త్యాగధనుడు అప్పారి వెంకటస్వామి అని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నేతలు కొనియాడారు. వెంకటస్వామి త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు.యూటీఎఫ్ వ్యవస్థాపక ప్రధానకార్యదర్శి వెంకటస్వామి 23వ వర్ధంతి సభను గురువారం హైదరాబాద్లోని సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి, చావ రవి, కమలకుమారి, మస్తాన్రావు, కే జంగయ్య, బుచ్చిరెడ్డి, భాస్కర్రావు తదితరులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.