హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు సంస్థలకు మరో గుర్తింపు లభించింది. తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ ట్రాన్స్కో)కు ఏ ప్లస్ (A+) క్యాటగిరీ వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్కో సంస్థల పనితీరును, ఆర్థిక రుణ క్రమశిక్షణ, లోపాలు లేని సేవలను పరిగణనలోకి తీసుకొని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) క్యాటగిరీలుగా విభజిస్తుంది.
ఈ సంవత్సరం అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ ట్రాన్స్కో ఏ+ కేటగిరీని దక్కించుకొన్నది. ఈ క్యాటగిరీ 1 జూన్ 2022 నుంచి తదుపరి కేటాయింపు ప్రక్రియ ప్రకటించే వరకు ఉంటుందని పీఎఫ్సీ తెలిపింది. తెలంగాణ ట్రాన్స్కోకు ఏ ప్లస్ క్యాటగిరీ రావడంపై ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సంస్థ ఇంజినీర్లు, కార్మికుల కృషితోనే గుర్తింపు ఈ దక్కిందని ఆయన పేర్కొన్నారు.