TSRTC | దత్తాత్రేయస్వామి భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి ప్రత్యేక సూపర్లగ్జరీ బస్సును నడుపనున్నట్లు పేర్కొంది. ఈ నెల 17న అమావాస్య సందర్భంగా ప్రత్యేకంగా సర్వీసును నడిపించనున్నట్లు తెలిపింది. గానుగాపూర్తో పాటు మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల దర్శనం కూడా కల్పించనున్నది. సర్వీసు నంబర్ 92221 గల ఈ ప్రత్యేక బస్సు.. ఈ నెల 16న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి గానుగాపూర్కు బయలుదేరనున్నది.
17న దత్తాత్రేయస్వామి దర్శనానంతరం.. అదే రోజు మధ్యాహ్నం12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు పండరీపూర్ చేరుకుంటుంది. అక్కడ పాండురంగస్వామి దర్శనం అనంతరం రాత్రి10 గంటలకు తుల్జాపూర్కు వెళ్తుంది. తుల్జాభవానీ దర్శనానంతరం 18న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్కు తిరిగి బయలుదేరనున్నది. అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఎంజీబీస్కు చేరుకుంటుంది. గానుగుపూర్ ప్రత్యేక ప్యాకేజీ ధరను రూ.2500గా టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
ఈ ధరలో ప్రయాణ సదుపాయం మాత్రమే సంస్థ కల్పిస్తోంది. దర్శనం, భోజన, వసతి సదుపాయాలు భక్తులదే బాధ్యత ఉంటుందని యాజమాన్యం తెలిపింది. గానుగాపూర్ ప్రత్యేక బస్ ముందస్తు రిజర్వేషన్ను టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ tsrtconline.inలో చేసుకోవచ్చని తెలిపింది. లేదంటే ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్లలోని కౌంటర్లలో ఈ టికెట్లను పొందవచ్చని చెప్పింది. ఈ ప్రత్యేక బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలకు 9440566379, 9959226257,9959224911 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరింది.