Chicken Friday | కరీంనగర్ తెలంగాణచౌక్, జనవరి 11: రెండు రోజుల క్రితం కరీంనగర్లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు డిపో-2 ఆవరణలో వేలం వేయనున్నారు. నిబంధనల ప్రకారం లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద మరిచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించాల్సి ఉంటుందని డిపో-2 మేనేజర్ మల్లయ్య తెలిపారు.
పందెం కోడి కోసం ఎవరూ రాకపోవడంతో శుక్రవారం వేలం వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పాల్గొనవచ్చని సూచించారు. వచ్చిన మొత్తాన్ని ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు.