హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్ విధులను ఆటంకపరచడమే కాకుండా దాడిచేసిన కేసులో ఇద్దరు ముద్దాయిలకు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించింది. శిక్షతోపాటు ఒకొకరికి రూ.500 జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్వాగతించారు.
గురువారం ట్విట్టర్లో హర్షం ప్రకటించారు. గద్వాల ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న బీ కృష్ణయ్యపై 2015 మార్చి 15న అలంపూర్కు చెందిన చాకలి శ్రీనివాస్, గోపి అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. మద్యం మత్తులో బస్సు ఎకిన ఇద్దరు టికెట్ తీసుకోకపోవటమే కాకుండా తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించారు. వారించిన కండక్టర్ కృష్ణయ్యపై దాడి చేశారు. తనపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కండక్టర్ అలంపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు న మోదు చేసుకున్న అప్పటి ఎస్ఐ పర్వతా లు.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు మంగళవారం విచారణకు రాగా.. న్యాయమూర్తి ఇద్దరు నిందితులకు రెండేండ్ల జైలు శిక్షతోపాటు ఒకొకరికి రూ.500 చొప్పున జరిమానా విధించా రు. నిందితులకు రెండేండ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్న పోలీస్, ఆర్టీసీ అధికారులకు సంస్థ తరపున ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. సిబ్బంది ఆత్మసె్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా దాడులకు, దౌర్జన్యాలకు దిగితే.. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.