TSRTC | హైదరాబాద్ : దత్తాత్రేయస్వామి భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దత్తాత్రేయ స్వామి ఆలయంతో పాటు ప్రముఖ ఆలయాలు కొలువైన మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్కు సర్వీసును నడిపిస్తోంది. ఈ నెల 31న ప్రారంభమయ్యే ఈ సర్వీస్ ముందస్తు రిజర్వేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. భక్తులు http://tsrtconline.in వెబ్ సైట్ లోకి వెళ్లి తమ టికెట్లను బుకింగ్ చేసుకోగలరని టీఎస్ ఆర్టీసీ అధికారులు సూచించారు.
కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి టూర్ ప్యాకేజీని #TSRTC అందిస్తోంది. దత్తాత్రేయ స్వామి ఆలయంతో పాటు ప్రముఖ ఆలయాలు కొలువైన మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్కు సర్వీసును నడిపిస్తోంది. ఈ నెల 31న ప్రారంభమయ్యే ఈ సర్వీస్ ముందస్తు రిజర్వేషన్ ప్రస్తుతం… pic.twitter.com/jQistiqQ2W
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) July 28, 2023