హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం (RTC govt merger) బిల్లును గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అడ్డుకోవడంతో ఆర్టీసీ కార్మికులు (RTC Employees) కదంతొక్కారు. ఉదయం రెండు గంటలపాటు బస్సులు బంద్చేసి డిపోల ముందు నిరసన తెలిపిన కార్మికులు, ఉద్యోగులు.. రాజ్భవన్ ముట్టడికి బయల్దేరారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపుమేరకు హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డుకు భారీగా చేరుకున్న కార్మికులు.. నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో ర్యాలీగా గవర్నర్ అధికార నివాసానికి చేరుకున్నారు. రాజ్భవన్ గేటు ముందు కూర్చుని నిరసన తెలుపుతున్నారు. గవర్నర్ తమిళిసైకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. వెంటనే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఆర్టీసీ బిల్లును వెంటనే గవర్నర్ వెంటనే ఆమోదించాలని ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బిల్లును కేబినెట్ ఆమోదించిందని, సభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ చర్యలు చేపట్టాలన్నారు.