హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తన భర్త ఏ రాజశేఖర్ను నేరం అంగీకరించాలని పోలీసులు వేధిస్తున్నారని ఏ సుచరిత దాఖలు చేసిన పిటిషన్ విషయంలో తాము ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. చిత్రహింసలకు గురిచేస్తున్నారని సుచరిత దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ పీ మాధవిదేవి సోమవారం విచారణ జరిపారు. ఈ నెల 11న పోలీసులు రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నారని 14వ తేదీ వరకు రిమాండ్ చేయలేదని, నేరం ఒప్పుకోవాలని పోలీసులు వేధిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. వాదనల తర్వాత హైకోర్టు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.