నాంపల్లి కోర్టులు, మే 8 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అన్నదమ్ములైన కోస్గి రవికుమార్ (ఏ21), కోస్గి భగవంత్కుమార్(ఏ22)ను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ పీపీ కృష్ణయ్య కోర్టును కోరారు. కీలక ఆధారాలు రాబట్టాల్సి ఉన్నందున కనీసం 3 రోజులు కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
నిందితుల తరఫు న్యాయవాది కస్టడీకి ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేశారు. న్యాయస్థానం తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు రేణుకరాథోడ్ (ఏ3), దామె ర రమేశ్కుమార్ (ఏ12), టీ రాజేందర్ కుమార్(ఏ14), తిరుపతయ్య (ఏ15), కోస్గి రవికుమార్ (ఏ21), కోస్గి భగవంత్కుమార్(ఏ22)కు బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఏ12కు పీపీ కౌంటర్ దాఖలు చేశారు.