హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): మెకానికల్ అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల నియామక రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఆర్టీ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది.
రాష్ట్రంలో 833 ఏఈ, టీవో, జేటీవో ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 12న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే 18, 19, 20న సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), టెక్నికల్ ఆఫీసర్ (టీవో), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (జేటీవో) ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరిగాయి.