హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి సూచించారు. 33 జిల్లా కేంద్రాల్లోని 1,019 సెంటర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. బుధవారం హైదారాబాద్లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో జనార్దన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న గ్రూప్-1 పరీక్షను ప్రతి అధికారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. శాంతియుత వాతావరణంలో పరీక్ష జరిగేలా చూడాలని కోరారు. సమావేశంలో టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, టీఎస్పీఎస్సీ సభ్యులు కారం రవీందర్రెడ్డి, రమావత్ ధన్సింగ్, బీ లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్ర ఆనంద్ తనోబా, ఆరవెల్లి చంద్రశేఖర్రావు, ఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.